కేసీఆర్ జిల్లాల పర్యటన

కేసీఆర్ జిల్లాల పర్యటన

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. రామగుండం విద్యుదుత్పత్తి కేంద్రంతో పాటు కాళేశ్వరం పనులను ఆయన పరిశీలించనున్నారు. రామగుండంలో ఎన్టీపీసీ 1,600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్న విద్యుత్‌ ప్లాంటును ఆయన పరిశీలిస్తారు. తర్వాత అక్కడే ఎన్టీపీసీ, జెన్‌కో అధికారులతో సమీక్షిస్తారు. కాళేశ్వరానికి అవసరమైన విద్యుత్‌ గురించి కూడా వాకబు చేస్తారు. రాత్రి కరీంనగర్‌లో బస చేసి, తర్వాత భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తారు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించి, పనుల పురోగతిపై సమీక్షిస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఎత్తి పోయాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, ఆ దిశగా సాగుతున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకుంటారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos