విద్యుత్కేంద్రాన్ని పరిశీలించిన కేసీఆర్

విద్యుత్కేంద్రాన్ని పరిశీలించిన కేసీఆర్

రామగుండం : ఇక్కడి ఎన్టీపీసీ విద్యుత్కేంద్రాన్ని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు శనివారం సాయంత్రం సందర్శించారు. తొలుత పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఎన్టీపీసీ అతిథి గృహానికి చేరుకున్న ఆయన అధికారులతో చర్చించారు. ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్‌ సింగ్‌తో సమావేశమయ్యారు. తర్వాత రామగుండంలో కొత్తగా 1,600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న విద్యుత్కేంద్రం వద్దకు చేరుకున్నారు. గురుదీప్‌ సింగ్‌తో కలసి నిర్మాణ పనులను పరిశీలించారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన వెంట సీఎస్‌ ఎస్‌కే. జోషి, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర రావు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. కేసీఆర్‌ ఆదివారం భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos