హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ పర్యటన రద్దయింది. సాయంత్రం అక్కడ సీఎం సభ జరగాల్సి ఉంది. గత రెండు గంటలుగా భారీ వర్షం కురుస్తుండటంతో పైలట్ల సూచన మేరకు హెలికాప్టర్లో వెళ్లేందుకు విమానయాన శాఖ అనుమతి ఇవ్వలేదు. మార్గమధ్యంలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతుండటంతో అనుమతి నిరాకరించినట్లు డైరెక్టర్ భరత్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ సభను రద్దు చేసినట్లు తెరాస ప్రకటించింది. కార్యకర్తలు నిరాశగా అక్కడి నుంచి వెనుదిరిగారు.