‘ మాధ్యమాల’కు కేసీఆర్ శాపం

‘ మాధ్యమాల’కు కేసీఆర్ శాపం

హైదరాబాదు: ‘కరోనా భయంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు దుర్మార్గులు సామాజిక మాధ్యమాల్లో చౌకబారు ప్రచారంతో ప్రజల్ని మానసికంగా హింసిస్తున్నారు. దీనికి తగిన ప్రతిఫలాన్ని వారు అనుభవించి తీరుతార’ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఇక్కడ మండి పడ్డారు. ‘మేము గొప్పవాళ్లం, మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరన్న గర్వంతో కొందరు మూర్ఖులు పెట్రేగిపోతున్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ప్రపంచం, దేశం ఆగం అవుతున్న సమయంలో వారి చిల్లర ప్రచారాలు న్యాయమేనా .తమనెవరూ ఏమీ చేయలేరేమనుకుంటున్నారుగాని, వారు అంతకు అంత అనుభవించేలా నేను చేసి చూపిస్తా. తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ముందుగా కరోనా పట్టుకోవాలని నేను శాపం పెడుతున్నాన’ని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos