హైదరాబాదు:‘పారాసెటిమాల్తో కరోనాను నివారించవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు? ఆయనపై ఎలాంటి చర్యల్ని తీసుకుంటారని నెటిజన్లు నగర పోలీసు కమిషనరు అంజని కుమార్ ను ప్రశ్నించారు. కేసీఆర్ తప్పుడు ప్రచరాన్ని చేస్తున్నారని ఒకరు ఈ నెల 14న ట్వీట్ చేసారు.ఇది సంచల నమైంది. దరిమిలా ఇప్పుడు ఆ ట్విట్టర్ అకౌంట్ కనపడటం లేదు. దీని వెనక కారణాలు పాలకులకే తెలుసు. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే ఎన్డీఎంఏ సెక్షన్ 54.1 కింద కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు పోలీసులు హెచ్చ రించారు. భయభ్రాంతులకు గురిచేసేలా కొన్ని చిల్లర ఛానెళ్లు వార్తలు ప్రసారం చేస్తున్నాయని శాసనసభలో కేసీఆర్ విమర్శించారు. దీనికి ప్రతిస్పందనగా ఒకరు ఏకంగా కేసీఆర్పైనే విమర్శనాస్త్రాన్ని ఎక్కుపెట్టారు.