బీజేపీలో చేరిన తెలుగు బిగ్‌బాస్‌ విజేత..

బీజేపీలో చేరిన తెలుగు బిగ్‌బాస్‌ విజేత..

తెలుగు బిగ్బాస్ షోతో గుర్తింపు,క్రేజ్‌ తెచ్చుకన్న బిగ్‌బాస్‌-2 విజేత కౌశల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. భార్య నీలిమతో కలిసి ఢిల్లీ చేరుకున్న కౌశల్.. పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, రాంమాధవ్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. నడ్డా వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇదే కార్యక్రమంలో రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన కుమార్తె,సుభారి, కౌశల్ భార్య నీలిమ కూడా బీజేపీలో చేరారు.బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా కౌశల్ తెలిపాడు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos