కచ్ : గుజరాత్, కచ్ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న పాకిస్థాన్ పౌరుడిని గురువారం బీఎస్ఎఫ్ గస్తీ జవాన్లు గురువారం ఉదయం బంధించారు. ‘పాక్ పౌరుడి వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉంటుంది. అతని వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవు. విచారిస్తున్నామ’ని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు.