బీజేపీకి షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి సిట్టింగ్ ఎంపీ

బీజేపీకి షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి సిట్టింగ్ ఎంపీ

జైపూర్: రాజస్థాన్లోని చురు లోక్ సభ స్థానం నుంచి రాహుల్ కాశ్వాన్ వరసగా రెండు సార్లు గెలుపొందారు. ఈసారి టికెట్ ఇవ్వమని భారతీయ జనతా పార్టీ తేల్చి చెప్పింది. దీంతో రాహుల్ కాశ్వాన్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో సోమవారం హస్తం పార్టీలో చేరారు. చురు లోక్ సభ నుంచి ఈ సారి బీజేపీ తరఫున జావెలిన్ త్రో క్రీడాకారుడు దేవేంద్ర బరిలోకి దిగుతారు. దేవేంద్ర కూడా స్థానికుడు కావడంతో బీజేపీ టికెట్ ఇచ్చింది. కినుక వహించిన రాహుల్ కాశ్వాన్ పార్టీ వీడుతున్నట్టు ప్రకటన చేశారు. టికెట్ గురించి హామీ వచ్చినందునే హస్తం పార్టీలో చేరుతున్నారని తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos