ఇంటర్‌నెట్‌ వాడేది అశ్లీల చిత్రాలు చూసేందుకే..

ఇంటర్‌నెట్‌ వాడేది అశ్లీల చిత్రాలు చూసేందుకే..

నీతి అయోగ్ సభ్యుడు, డీఆర్డీఓ మాజీ డైరెక్టర్ జనరల్ వి.కె.సారస్వత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలు ఇంటర్నెట్‌ను బూతు సినిమాలు చూడడానికి మాత్రమే వినియోగిస్తున్నారని పరిస్థితుల్లో నెట్ సేవలు నిలిపివేయడం వల్ల ఆర్థికంగా వచ్చే నష్టం ఏముంటుందని వ్యాఖ్యానించారు. కశ్మీర్ విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, వదంతులు వ్యాప్తి చెందకుండా చేయడం కోసమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. లేదంటే సామాజిక మాధ్యమాల ద్వారా అక్కడ కూడా ఢిల్లీ లాంటి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించే వారని ఆరోపించారు.సారస్వత్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos