కాంగ్రెస్‌ వారికిదేం దుర్బుద్ధి

కాంగ్రెస్‌ వారికిదేం దుర్బుద్ధి

హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావద్దంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని కాంగ్రెస్‌ నాయకులు కోరడం వారి కుటిల నీతికి అద్దం పడుతోందని తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఆరోపించారు. వీరి వాలకం చూస్తుంటే మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలను కూడా తప్పుబడుతున్నట్లుందని అన్నారు. శనివారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ దేశంలోనే అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును స్వాగతించకపోగా, వీరి దుర్బుద్ధిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రైతుల కన్నీళ్లు తుడిచే కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల కాంగ్రెస్‌ తీరు ఇలాగే కొనసాగితే, ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos