మరో వివాదంలో కర్ణాటక మాజీ సీఎం..

కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య మరోసారి వివాదాల్లో ఇరుక్కున్నారు.కర్ణాటక రాష్ట్ర గీతం వినిపిస్తున్న సమయంలో సిద్దరామయ్య చేష్టలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అధికార పక్ష నేతల నుంచి సాధారణ ప్రజలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. కన్నడ నాడ గీతం ఆలపిస్తున్న సమయంలో మాజీ సీఎం సిద్దరామయ్య కాళ్లు చేతులు ఊపుతూ నోటిలో ఏదో తిని మిగిలిన పదార్థాలను బయటకు ఉంచుతూ కనిపించారు. అక్కడే ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా కెమెరాల్లో సిద్దరామయ్య చేష్టల దృశ్యాలు రికార్డు అయ్యాయి.వేదిక మీద ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఆ కార్యక్రమానికి హాజరైన ప్రజలు సైతం మాజీ సీఎం సిద్దరామయ్య తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిద్దరామయ్య చేష్టల వీడియో మీడియాలో ప్రసారం కావడంతో వైరల్ అయ్యింది. సిద్దరామయ్య నాడ గీతం ను అవమానించారని బీజేపీ నాయకులతో పాటు పలు పార్టీల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos