అమరావతి: తెలుగు దేశం నేత, చీరాల శాసనసభ్యుడు కరణం బలరాంకు ఉన్నత న్యాయస్థానం తాఖీదుల్ని జారీ చేసింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖ లైన వ్యాజ్యానికి మూడు వారాల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల ప్రమాణ పత్రంలో పలు అంశాలను దాచిపెట్టారని వైకాపా నేత, మాజీ శాసనసభ్యుడు ఆమంచి కృష్ణ మోహన్ ఉన్నత న్యాయస్థానంలో బలరాంకు వ్యతిరేకంగా వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. ‘తన నామ పత్రం లో భార్య పేరును కరణం సరస్వతిగా బలరాం పేర్కొన్నారు. ఆయన మరో భార్య ప్రసూన, కుమార్తె గురించి నామినేషన్లో ప్రస్తావించలేదు. అందువల్ల ఆయన ఎన్నికను రద్దు చేయాల’ని కోరారు. వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవి, కరణం బలరాం, అప్పటి చీరాల ఎన్నికల అధికారికి తాఖీదుల్ని జారీ చేశారు. విచారణను 3 వారాల పాటు వాయిదా వేశారు.