చంద్రబాబుతో కపిల్‌దేవ్‌ ముచ్చట్లు..

చంద్రబాబుతో కపిల్‌దేవ్‌ ముచ్చట్లు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఒకే విమానంలో పక్కపక్క సీట్లలో కూర్చొని ముచ్చట్లాడుకుంటున్న వీడియోలు,ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గుంటూరు జిల్లాలో రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబచరిన విద్యార్థులకు అవార్డుల బహూకరణ కార్యక్రమానికి వచ్చిన కపిల్ దేవ్, తిరుగు ప్రయాణంలో విజయవాడ చేరుకుని విమానం ఎక్కారు.అదే విమానంలో చంద్రబాబు కూడా ప్రయాణిస్తున్నారు. చంద్రబాబును చూసిన కపిల్ దేవ్, ఆయన పక్కన కూర్చుని, కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి తాను తీసుకున్న చర్యలను గురించి చంద్రబాబు, కపిల్ కు వెల్లడించారు. కాగా, వారికి బహుమతులను అందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos