కాన్పూర్ : గెలుపు ఖాయమనుకున్న తొలి టెస్టులో భారత్కు నిరాశ తప్పలేదు. చివరి వికెట్ తీయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ అడ్డుగోడగా నిలబడి విలియమ్సన్ బృందాన్ని ఓటమి బారి నుంచి తప్పించారు. ఫలితంగా మ్యాఛ్ డ్రాగా ముగిసింది. అరంగేట్ర హీరో శ్రేయస్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అయ్యర్ ఈ మ్యాచులో మొత్తంగా 170 పరుగులు చేశాడు.