డ్రగ్స్ కేసులో కన్నడ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ కు సమన్లు..

డ్రగ్స్ కేసులో కన్నడ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ కు సమన్లు..

కన్నడ చిత్ర పరిశ్రమలో మాదక ద్రవ్యాల పరిణామం కలకలం సృష్టిస్తోంది.ఈ కేసులో పోలీసులు వేగం పెంచడంతో పలు సంచలన విషయాల బయట పడుతున్నాయి.నటి రాగిణి ద్వివేదికి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు జారీ చేయడం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈరోజు రాత్రిలోగా సీబీఐ విచారణకు హాజరు కావాలంటూ రాగిణిని ఆదేశించారు. మరో వైపు ఈ కేసులో ఇప్పటికే రాగిణి స్నేహితుడు రవిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో రాగిణికి కూడా సంబంధాలు ఉన్నట్టు రవి విచారణలో సంకేతాలు అందినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, ఆమెకు సమన్లు జారీ అయ్యాయి.మరోవైపు కన్నడ నటీనటులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను గత నెల 20న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో పలువురు నటీనటులు, మోడల్స్ పేర్లు ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos