పాత్రికేయులకు ఆదాల 2లక్షల విరాళం

పాత్రికేయులకు ఆదాల 2లక్షల విరాళం

నెల్లూరు : లోక్సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రకాశం జిల్లా కందుకూరులోని పాత్రికేయులకు రూ.రెండు లక్షల విరాళాన్ని అందించారు. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి ద్వారా ఈ మొత్తాన్ని వితరణ చేసారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడారు. పాత్రికేయుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డి అందించిన రూ.రెండు లక్షల రూపాయల విరాళంతో వారికి నిత్యావసర సరుకుల్ని సమకూరుస్తామని తెలిపారు. రంగా రెడ్డి మాట్లాడుతూ ఈ లాక్ దౌన్ సమయంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని పేర్కొన్నారు. లాక్ డౌన్ సహాయక చర్యల కోసం ఆదాల ఇటీవల తన సొంత నిధులు రూ. 20 లక్షల రూపాయలను జిల్లా కలెక్టర్ కు అందించారు.

తాజా సమాచారం