తమిళనాడు:జమ్ము-కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు ప్రజాస్వామ్య హనమని సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ మంగళవారం ట్విట్టర్లో మండి పడ్డారు. తిరోగమన, నిరంకుశ చర్య అని విమర్శించారు. అధీకరణ 370, 35 ఏ పుట్టుకకు నిర్దిష్ట కారణం ఉందన్నారు. పూర్తి స్థాయిలో చర్చలు జరిపిన తర్వాతే వీటిలో ఏవైనా మార్పులు చేసి ఉంటే బాగుండేదన్నారు. బలవంతంగా ప్రతిపక్షాల నోళ్లు మూయించారని దుయ్య బట్టారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య మనుగడను ప్రశ్నార్థకం చేస్తాయని వ్యాఖ్యానించారు.