కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద భారీ భద్రత

కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద భారీ భద్రత

హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం దృష్ట్యా గురువారం నుంచి అక్కడ భారీ భద్రత కల్పించారు. వరంగల్‌ రేంజ్‌ ఐజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఈ ప్రాంతం మావోయిస్టు ప్రాబల్యం కలిగి ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ నాలుగు వేల మంది పోలీసులతో భద్రత కల్పించారు. గ్రేహౌండ్స్‌, స్పెషల్‌ ఫోర్సును కూడా పోలీసు శాఖ పంపింది. చత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టులు వచ్చారనే సమాచారంతో ప్రాజెక్టు చుట్టూ హై అలర్ట్‌ ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos