తెలుగుతో పాటు తమిళంలో పలు చిత్రాలతో బిజీగా ఉన్న చందమామ కాజల్ అగర్వాల్ షూటింగ్లకు విరామం లభించడంతో పలు పర్యాటక ప్రాంతాల్లో చక్కర్లు కొడుతోంది.అందులో భాగంగా ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్మహల్ వీక్షించడానికి వెళ్లిన కాజల్ తాజ్మహల్ ముందు కేరింతలు కొడుతూ తీసుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.తాజ్ మహల్ ని చుడగానే మైకం కమ్మినంత పని అయ్యిందంటూ గతంలోనే ఈ అద్భుత కట్టడ అందాల గురించి విన్నాను అని, అలాగే ఇప్పుడు ఆ అందాలు తనను గతంలోకి తీసుకెళ్లాయి అని కాజల్ పేర్కొంది.దీంతో చందమామ ఉదయాన్నే తాజ్ మహల్ ముందుకు వచ్చిందేంటి అంటి నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక కాజల్ ఇచ్చిన క్యాప్షన్ కూడా నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది.