ఎన్నో అనుమానాలు,అంచనాల మధ్య 2017లో తెలుగుతెరపై అడుగుపెట్టిన బిగ్బాస్ మొదటి సీజన్ జూ.ఎన్టీఆర్ హోస్ట్ చేయడంతో సూపర్హిట్ అయ్యింది.అయితే వ్యక్తిగత కారణాలతో రెండవ సీజన్ నుంచి ఎన్టీఆర్ తప్పుకోవడంతో నాని ఎంటర్ అవడం రెండవ సీజన్లో కంటెస్టంట్ల చిల్లర వేషాలు,కౌశల్ ఆర్మీ రచ్చతో మొదటి సీజన్ అంత కాకపోయినా ఫర్వాలేదనే స్థాయిలోనే నడిచింది.రెండవ సీజన్లో తనపై కూడా విమర్శలు రావడంతో మూడవ సీజన్కు హోస్ట్ చేసేది లేదని నాని తేల్చి చెప్పడంతో బిగ్బాస్ నిర్వాహకులు హోస్ట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలో అనుష్క,నాగార్జున,వెంకటేశ్,విజయ్ దేవరకొండ,అల్లు అర్జున్ ఇలా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి ఒకదశలో మళ్లీ ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.చివరకు నాగార్జునతో డీల్ సెట్ అయ్యిందని హోస్ట్గా వ్యవహరించేందుకు నాగ్ అంగీకరించినట్లు సమాచారం.ఇకపోతే మూడవ సీజన్కు క్రేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్వాహకులు వివాదాస్పద సెలెబ్రిటీలతో పాటు క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పేరుతో హడావిడి చేసిన కేఏ పాల్తో పాటు జనసేన అధినేత పవన్కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయిని కూడా మూడవ సీజన్లో కంటెస్టంట్లుగా ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారని ఇప్పటికే ఇరువురితో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది.ఒకవేళ ఇది కనుక నిజమే అయితే మూడవ సీజన్ సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవేమో.బిగ్బాస్ ప్రసారం చేసే ఛానల్కు టీఆర్పీ రేటింగులు ఆకాశాన్నంటడం తథ్యం.చూడాలి మరి ఇది ఎంత వరకు నిజమో..