లౌకిక ప్రజాస్వామ్యం నాశనం

లౌకిక ప్రజాస్వామ్యం నాశనం

యాదాద్రి : ప్రధాని మోదీ హయాంలో లౌకిక ప్రజాస్వామ్య విలువలు ధ్వంసమయ్యాయని సీపీఎం పోలిట్బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు మండి పడ్డారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. హైందవ సంస్కృ తిని అనుసరించే వారే ఈ దేశంలో ఉండాలని ఆరెస్సెస్ అధినేత అనడం మతోన్మాదాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలని దుయ్యబట్టారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఓట్లేసిందని, ఎన్నార్సీ పై భాజపా మిత్రపక్షాలతో పాటు వైకాపా కూడా సహకరిస్తోందని విమర్శించారు. ఎన్నార్సీపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపటం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల మాదిరిగానే ఎన్నార్సీని అమలు చేయకుండా కేసీఆర్ తీర్మానించాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos