న్యూఢిల్లీ : సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా చెలరేగిన నిరసనల్లో జామియా మిలియా విశ్వ విద్యాలయం ఆవరణలోకి పోలీసులు ప్రవేశించి విద్యార్ధులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని వర్సిటీ అధికారులు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్డీ)కు సమర్పించిన తాజా నివేదికలో పేర్కొన్నారు. దీని గురించి న్యాయ విచారణ చేపట్టాలని కోరింది. డిసెంబర్ 15, 16 ల్లో మధుర రోడ్, జులేనా రోడ్లపై ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు భాష్పవాయుగోళాలను ప్రయోగించారని నివేదికలో పేర్కొన్నారు.