న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ శుక్రవారం ఇక్కడ లోక్సభ సమావేశాల గురించి 15 నిముషాల పాటు చర్చించారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్, నరేంద్ర సింగ్ తోమర్ కూడా ఉన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్, లోక్సభలో డీఎంకే పక్ష నేత టీఆర్ బాలుతో కూడా ప్రహ్లాద్ జోషీ సమావేశ మయ్యారు . 17వ లోక్సభ తొలి సమావేశాలు జూన్ 17న ప్రారంభం కానున్నాయి. తొలి రెండు రోజుల్లో కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులు ప్రమాణాలు చేస్తారు. జూన్ 19న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 20న రాష్ట్ర పతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభల నుద్దేశించి ప్రసంగిస్తారు. జులై 5న బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. జులై 26 వరకు సమావేశాలు సాగనున్నాయి. ఈ సమావేశాల్లో 10 అత్యవస రాదేశాలు కూడా చర్చకు రానున్నాయి.