భీమ వరం : ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరిలో దూకిన శ్రీనివాస రావుకు ఎందుకో మళ్లీ ప్రాణంపై ఆశ కలగటంతో 15 గంటల పాటు నిరీక్షించి గండం నుంచి బయట పడ్డాడు. అత్తిలి నివాసి కీలపర్తి శ్రీనివాసరావు జీవితంపై విరక్తి చెంది మంగళవారం సాయంత్రం జొన్నాడ వంతెన నుంచి నదిలోకి దూకాడు. నదిలో కొట్టుకుపోతున్న ఆయనకు మార్గ మధ్యంలో ప్రాణాలపై తీపి కలిగింది. దీంతో ఇసుక మేటల్లో కనిపించిన చెట్టును 15 గంటల పాటు పట్టుకునే ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం అతణ్ని చూసిన స్థానికులు చూసారు. దరిమిలా పోలీసులు పడవ ద్వారా అతణ్నిఒడ్డుకు చేర్చారు.