భాజపాలో చేరిన రేవూరి, రవీంద్ర నాయక్

భాజపాలో చేరిన రేవూరి,  రవీంద్ర నాయక్

ఢిల్లీ : తెదేపా మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, తెరాస మాజీ ఎంపీ రవీంద్ర నాయక్‌లు బుధవారం ఢిల్లీలో భాజపాలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ పార్టీ సభ్యత్వ రసీదును అందించారు. అనంతరం అందరూ కలసి పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ. నడ్డాను కలిశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ తెలంగాణలో భాజపా ప్రత్యామ్నాయ శక్తి అని, అందువల్ల చాలా మంది తమ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని తెలిపారు. లక్ష్మణ్ మాట్లాడుతూ తమ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి, తెరాస తమ కార్యకర్తలపై పోలీసులను ఉసిగొల్పుతోందని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos