రాహుల్ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన

రాహుల్ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన

కర్నూలు: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ  చేపట్టిన భారత్‌ జోడో యాత్ర   బుధవారం ఆదోని మండలం చాగి గ్రామం నుంచి జోడో యాత్ర ప్రారంభమైంది. తెలంగాణ,  ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే  సీతక్క  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడారు. ‘రాహుల్ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. రాహుల్ గాంధీ కష్టపడుతోంది దేశం కోసమే.  బీజేపీ దేశ ప్రజల మధ్య విషపు మొక్కలు నాటుతోంది. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్‌కు అడ్డాఅని ఉప ఎన్నికలో అధికార పార్టీల మధ్య డబ్బుల పోటీ నడుస్తోంది. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమ’న్నారు. మంగళవారం నల్గొండ  ఎంపీ  ఉత్తమ్ కుమార్ రెడ్డి రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు. కర్ణాటకకు చెందిన నేతలు కూడ ఉన్నారు. ఏపీ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు 119 కి.మీ పాదయాత్ర సాగనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos