మేము విచారణ జరిపే వరకు మీరు ఆగండి: సుప్రీంకోర్టు

న్యూ ఢిల్లీ: జ్ఞాన్వాపి మసీదులో సర్వే వ్యవహారంపై శుక్రవారం తాము విచారణ చేపట్టే వరకు విచారణను నిలిపివేయాలని సుప్రీంకోర్టు గురువారం వారణాశి న్యాయస్థానాన్ని ఆదేశించింది. వీడియోగ్రఫీ సర్వేను వ్యతిరేకిస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు నిర్వహణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను కొనసాగించింది. విచారణను శుక్రవారానికి లేదా మరో రోజుకు వాయిదా వేయాలని హిందూ సంఘం తరఫు న్యాయవాది కోరారు. గురువారమే కొనసాగించాలని మసీదు కమిటీ తరఫు న్యాయవాది హుజేఫా అహ్మదీ అభ్యర్ధించారు. దేశంలోని అనేక మసీదులను సీల్ చేయాలని వివిధ కోర్టులకు దరఖాస్తులు అందాయని, జ్ఞానవాపి మసీదులో కొలను చుట్టూ ఉన్న గోడను కూల్చివేయాలని కూడా దరఖాస్తు అందించారని మసీదు కమిటీ తరఫు న్యాయవాది వివరించారు. హిందూ భక్తులు సివిల్ కోర్టు ఆదేశాలు పాటించకుండా చూడాలని విన్నవించారు. హిందువులు సివిల్ కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటారని హిందూ భక్తుల తరపు న్యాయవాది హామీ ఇచ్చారు. దీనిపై శుక్ర వారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరపనున్నట్లు ధర్మాసనం తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos