కమలం నీడకు దివాకరుడు

కమలం నీడకు దివాకరుడు

విజయవాడ: అనంతపురం జిల్లా ప్రముఖ రాజకీయ నేత జేసి.దివాకరరెడ్డి, ఆయన సోదరుడు ప్రభాకర రెడ్డి కాషాయ ధ్వజాన్ని చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వారిద్దరూ ఇది వరకే ఒక సారి భాజపా జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ మంతనాలు జరిపి సానుకూల సంకేతాల్ని పొందినట్లు తెలిసింది. త్వరలోనే ఢిల్లీలో భాజపా అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కమలాన్ని చేపటనున్నారని వారి అనుచర వర్గాలు తెలిపాయి. లోక్సభ. శాసనసభ ఎన్నికల్లో పరాభవం పాలు కావటంతో వారసుల భవిష్యత్తు దృష్ట్యా భాజపాలో చేరదలచినట్లు చెప్పారు.వారి చేరిక తర్వాత మరిందరు తెదేపా నేతలు వారిని అనుసరించదలచినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వారిలో పరిటాల సునిత, ఆమె తనయుడు శ్రీరాం, పల్లె రఘునాథ రెడ్డి ఉన్నారన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos