అనంతపురం: ప్రైవేటు బస్సుల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణ పై కడప కేంద్ర కారాగారంలో బంధీగా ఉన్న మాజీ శాసన సభ్యుడు జే సీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు మరోమారు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఆయన్ను ప్రశ్నించేందుకు అనుమ తించాలని కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీసులు చేసినవినతికి కోర్టు సానుకూలంగా స్పందించింది. కేవలం ఏడు గంటల పాటు మాత్రమే ప్రశ్నించేందుకు అనుమతించారు.దరిమిలా ఆయన్ను చెరసాల నుంచి పోలీసు అధికారులు మరో చోటకు తీసుకుని వెళ్లారు. గడువు ముగిసిన తర్వాత వాత తిరిగి ఆయన్ను కడప కేంద్ర కర్మాగారానికి తరలించనున్నారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లపై ఓర్వకల్లు పోలీసు ఠాణాలో కూడా కేసు దాఖలు కావటం తెలిసిందే.