కంగనా రనౌత్‌కు రూ.24 కోట్ల పారితోషకం?

  • In Film
  • March 25, 2019
  • 138 Views
కంగనా రనౌత్‌కు రూ.24 కోట్ల పారితోషకం?

మణికర్ణిక సాధించిన విజయంతో కంగనా రనౌత్‌ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.మణికర్ణిక చిత్రీకరణలో జరిగిన గొడవల నుంచి విడుదల సమయంలో విడుదలయ్యాక కంగనా,దర్శకుడు క్రిష్‌ల మధ్య జరిగిన మాటల యుద్ధం ఇవన్నీ వెరసి మణికర్ణికకు ఎక్కడ లేని క్రేజ్‌ తెచ్చిపెట్టడంతో మణికర్ణిక ఘన విజయం సాధించింది.ఈ క్రమంలో కంగనా నటించనున్న తుదపరి చిత్రం కూడా జాతీయవ్యాప్తంగా చర్చలకు దారి తీసింది.తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తలైవి పేరుతో తెరకెక్కనున్న చిత్రంలో జయలలిత పాత్రలో నటించనున్న కంగనా రనౌత్‌ తలైవి చిత్రంలో నటించడానికి రూ.24కోట్ల పారితోషకం అడిగినట్లు సమాచారం.తమిళంతో పాటు తెలుగు,హిందీల్లో కూడా తెరకెక్కనుండడంతో ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించిన కంగనా అందుకు రూ.24 కోట్ల పారితోషకం డిమాండ్‌ చేయగా కంగానూ అడిగినంత ఇవ్వడానికి నిర్మాత విష్ణు ఇందూరి కూడా అంగీకరించినట్లు సమాచారం. కంగనా నటనా కౌశల్యంతో తలైవి చిత్రం పెట్టుబడికి రెండింతలు రాబడుతుందనే నమ్మకంతో నిర్మాత విష్ణు అంతభారీ మొత్తంలో పారితోషకం ఇవ్వడానికి అంగీకరించినట్లు సమాచారం.ఒకవేళ ఈ వార్తలు నిజమే అయితే  చాలా మంది హీరోలు సైతం అందుకోలేని భారీ మొత్తాన్ని పారితోషకంగా అందుకుంటున్న మొదటి హీరోయిన్‌గా కంగనా రనౌత్‌ రికార్డు సృష్టించనుంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos