రాంచీ : భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఆటగాళ్లు ఆర్మీ టోపీలను ధరించారు. పుల్వమా సంఘటనలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళిగా వీటిని వేసుకున్నారు. లెఫ్ట్నెంట్ కల్నల్ (గౌరవ) హోదాలో మహేంద్ర సింగ్ ధోనీ ఈ టోపీలను ఆటగాళ్లకు ఇచ్చాడు. ఈ సందర్భంగా కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ అమర జవాన్లకు నివాళులర్పించడానికి ఈ టోపీలను ధరించామని, ఈరోజు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజును జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇస్తామని వెల్లడించారు. జవాన్ల కోసం, వారి కుటుంబాల కోసం దేశంలో అందరూ ఎంతో కొంత సాయం చేయాలని కోహ్లీ కోరారు.