వివేకా హత్యపై మళ్లీ దర్యాప్తు చేయాలి

అమరావతి: తన తండ్రి , మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్యపై దర్యాప్తు జరిపించాలని ఆయన కుమార్తె సునీత, బుధవారం తన సోదరుడు, ముఖ్యమంత్రి వై.యస్. జగన్‌ను బుధవారం స్వయంగా కలసి విన్నవించారు. బుధవారం తాడేపల్లిలోని జగన్ నివాసంలో వారిద్దరూ అరగంట పాటు హత్య గురించి చర్చించినట్లు తెలిసింది. వివేకానంద రెడ్డి హత్య గురించి దర్యాప్తుకు గత ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందంపై తమకు నమ్మకం లేదని సునీత పున రుద్ఘాటించారు. దర్యాప్తును మెుదటి నుంచి చేయించాలని విన్నవించారు. 2019 మార్చి 15న వైయస్ వివేకానంద రెడ్డి తన నివాసం లోనే అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ప్రత్యేక దర్యాప్తు బృందం సంస్థ ఇప్పటి వరకూ నలుగురిని అరెస్టు చేసింది. నిందితులు చెరసాల్లో బంధీలుగా ఉన్నారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఇతర కుటుంబ సభ్యులు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్‌ ఏ నిర్ణ యాన్ని తీసుకుంటారో నిరీక్షించాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos