ప్రకంపనలు రేపుతున్న జనసేన తాజా ట్వీట్

ప్రకంపనలు రేపుతున్న జనసేన తాజా ట్వీట్

త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల కోసం పవన్‌కల్యాణ్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆయన.. పార్టీ మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఇటీవలే ప్రకటించారు. వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు.

అయితే తన ప్రచారంలో తెలుగు సినిమా దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్టీఆర్ చేసిన ఓ వ్యాఖను ప్రస్తావిస్తూ.. ఎన్టీఆర్‌లా తాను అహంకారాన్ని తలకెక్కించుకోనని పవన్ చెప్పకనే చెప్పారు.

‘‘ఎన్టీఆర్‌గారు మెదక్ లో కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అని మాట్లాడారు, ఆ ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు, నా వెనుక లక్షలాది మంది జనసైనికులు ధవళేశ్వరం అయినా, అనంతపురంలో అయినా వచ్చారని నేను తలకి ఎక్కించుకోను’’ అని పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను జనసేన పార్టీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ తన పార్టీ గురించి, తన గురించి ప్రచారం చేసుకోవాలి.. అంతేకాని తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడిని ఉద్ధేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిమానులు మండిపడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos