ఓట్లేయక పోయినా జనం వెంటే…

ఓట్లేయక పోయినా జనం వెంటే…

అమరావతి : ప్రజలు ఓట్లేయక పోయినా ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం కొనసాగిస్తానని జన సేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. భీమవరంలో తన ఓటమిపై చాలా మంది కుంగిపోయారని, తాను పది నిముషాల్లోనే తేరుకుని భవిష్యత్తు గురించి ఆలోచించానని చెప్పారు. ఓటమిని తలుచుకుని తలచుకుని ఎంతకాలం బాధపడతామని అన్నారు. తన తుది శ్వాస వరకు పార్టీని నడుపుతానని స్పష్టం చేశారు. తన సోదరుడు చిరంజీవి మెతక వైఖరి, ఒత్తిడి వల్లే ప్రజా రాజ్యం పార్టీని నడపలేకపోయారని అన్నారు. ఇప్పటిలా ఆ సమయంలో నాయకులందరినీ కూర్చొనిబెట్టి మాట్లాడి ఉండే ఆ పార్టీ ఉండేదన్నారు. జన సేనకు ప్రస్తుతం శాసన సభలో ఒకే ఎమ్మెల్యే ఉన్నారని, మున్ముందు అసెంబ్లీలో మొత్తం స్థానాలను ఆక్రమించే స్థాయికి పార్టీ చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos