కాంగ్రెస్‌ గెలుపును దేవుడు ఆపలేడు..

కాంగ్రెస్‌ గెలుపును దేవుడు ఆపలేడు..

మరో ఐదు రోజుల్లో వెలువడనున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ప్రభంజనం సృష్టించడం తథ్యమని కేంద్రంలో అధికారంలోకి రావడం కూడా తథ్యమంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి జోస్యం చెప్పారు.తెలగాణలో కూడా కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థులు అఖండ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని కాంగ్రెస్‌ గెలుపును చూసి తెరాస అధినేత కేసీఆర్‌ తల దించుకుంటారన్నారు.మరో అడుగు ముందుకేసి తెలంగాణలో ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ విజయాన్నిదేవుడు కూడా అడ్డుకోలేడని వ్యాఖ్యానించారు.మల్కాజ్‌గిరి,నల్గొండ,ఖమ్మం,భువనగిరి,కొండా విశ్వేశ్వరరెడ్డి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయం ఖాయమైందన్నారు.తెలంగాణలో గెలిచే అభ్యర్థులకు యూపీఏ మంత్రివర్గంలో మంత్రిపదవులు కూడా దక్కనున్నాయన్నారు.ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ పార్టీని వీడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos