ప్రమాణ స్వీకారోత్సవం 30న మ.12.23 గం..లకు

ప్రమాణ స్వీకారోత్సవం 30న మ.12.23 గం..లకు

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి ఈ నెల 30న మధ్యాహ్నం 12.23 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని కోసం విజయవాడంలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంను అధికారులు వేదికగా ఖరారు చేశారు. స్టేడియం గ్యాలరీల్లో 35 వేల మంది కూర్చుని ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకించే అవకాశం ఉంది. కింద మరో ఇరవై వేల మంది కూర్చునే సదుపాయం ఉంది. కనుక అక్కడే ప్రమాణ స్వీకారోత్సవానికి అనువుగా ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ. సుబ్రమణ్యం నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది. ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు వీవీపీఐలు హాజరు కానున్నందున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ అధికారులను ఆదేశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos