ప్రత్యేక ఆర్థిక సాయం కోరిన జగన్

ప్రత్యేక ఆర్థిక సాయం కోరిన జగన్

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులతో పాటు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. బుధవారం ఆమెతో సమావేశమైన ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న రూ.5 వేల కోట్లనుకూడా విడుదల చేయాలని కోరారు. నవ రత్నాల పథకం అమలుకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీలను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలతో మంగళవారం సమావేశమయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos