అమరావతి : ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30న ప్రధాని నరేంద్ర మోది ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఆయనతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఢిల్లీ వెళతారని తెలిసింది. జగన్ 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. దీని కోసం ఆయన 29న రాత్రి విజయవాడ చేరుకుంటారని తెలిసింది. ప్రమాణ స్వీకారం ముగిశాక ఇద్దరూ కలసి ఢిల్లీ వెళ్లే యోచనలో ఉన్నారని సమాచారం. వీరితో పాటు వైకాపాకు చెందిన కొందరు సీనియర్ నాయకులు కూడా వెళతారని తెలిసింది.