ప్రొఫెసర్‌పై భాజపా కార్యకర్తల దాడి

ప్రొఫెసర్‌పై భాజపా కార్యకర్తల దాడి

కోల్కతా : జాదవ్పూర్ విశ్వ విద్యాలయం ఆవరణలో భాజపా మహిళా కార్యకర్తలు తనపై దాడి చేశారని ఆంగ్ల విభాగం అసి స్టెంట్ ప్రొఫెసర్ దొయితా మజుందార్ ఆరోపించారు. ఒక వర్గాన్ని కించపరచి, విశ్వ విద్యాలయం ప్రతిష్టను మసకబార్చేలా ఆ పార్టీ కార్యకర్త చేసిన వ్యాఖ్యల్ని ఖండించినందుకు తనను గాయ పర చారని వెల్లడించారు. ఈ ఆరోపణల్ని భాజపా ఖండిం చింది. ఆవరణలో జరిగిన తమ పార్టీ సమావేశంలో వామపక్ష మద్దతుదారులు ఆందోళన చేపట్టినా సంయమనం పాటించినట్లు పేర్కొంది. ‘ పౌర చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొని నేను వెనుదిరిగి వస్తున్నపుడు ఆవరణలో భాజపా కార్య కర్తల సమావేశం జరుగుతోంది. ఆ పార్టీ నేతలు విద్వేషపూరిత ప్రసంగం చేసారు. అన్ని అనర్ధాలకు ఈ విశ్వ విద్యాలయం కారణం. ఇక్కడ ప్రతిరోజూ వారంతా అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేస్తుంటారని ఓ వక్త చెప్పినపుడు నేను అవి అసత్యా లని బిగ్గరగా అరిచాను. నేనిలా ప్రతిఘటించిన వెంటనే పలువురు మహిళా కార్యకర్తలు నన్ను చుట్టుముట్టి దారుణంగా కొట్టా రు. అడ్డగించిన మరో వ్యక్తిని కూడా వారు గాయపరిచారు. ఈ ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసాన’న్నారు. విచారణ చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos