ఇస్లాంను కించ పరిస్తే ఇదే గతి

ఇస్లాంను కించ పరిస్తే ఇదే గతి

లక్నో: హిందూ సమాజ్ పార్టీ చీఫ్ కమలేశ్ తివారీ హత్యకు తామే బాధ్యులమని అల్ హింద్ బ్రిగేడ్ అనే సంస్థ శనివారం వాట్సాప్లో ప్రకటించింది. ఇందులో నిజానిజాలు తేలాల్సి ఉంది. ‘ముస్లింలను, ఇస్లాంను కించపర్చేందుకు ప్రయత్నించినందుకు మేమే కమలేశ్ తివారీని హత్య చేశాం. ఇస్లాంను, ముస్లింలను కించపర్చే వాళ్లందరి గతి ఇలాగే ఉంటుంది. ముందు ముందు ఇలాంటివి మరిన్ని చూస్తారు. యుద్ధం మొదలైంది’అని అల్ హింద్ బ్రిగేడ్ పేరిట ఒక సందేశం సంచలనంగా మారింది. దుండగులు హతుడు తివారీ ఫోటోనూ జత చేసారు. ఈ సంస్థకు ఏదైనా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయా లేదానే విషయం కూడా ఇంకా తెలియరాలేదు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని ఉత్తర ప్రదేశ్ అదనపు డీజీపీ రామశాస్త్రి విలేఖరులకు పేర్కొన్నారు. ఇక్కడి నాకా ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం హిందూ సమాజ్ పార్టీ చీఫ్ కమలేష్ తివారీని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos