దాడులకు పాక్‌ దిశానిర్దేశం

దాడులకు పాక్‌ దిశానిర్దేశం

న్యూ ఢిల్లీ: ఇండియాలో ఉగ్ర దాడులకు ఉసి కొల్పేలా పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ, ఉగ్ర సంస్థలతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఇస్లామాబాద్ లోని ఓ రహస్య ప్రదేశంలో నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనికి జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఖలిస్థానీ జిందాబాద్ ఫోర్స్ తదితర సంస్థలు హాజరయ్యాయని సమాచారం. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో ఎప్పు డైనా భారత్ పై ఉగ్ర వాదుల దాడులు జరగవచ్చని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐఎస్ఐ నిర్వహించిన సమావేశం కీలక వివరాల్ని నిఘా విభాగం సమీకరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos