విమర్శకులపై ఉక్కు పాదం

విమర్శకులపై ఉక్కు పాదం

పాట్నా: ప్రభుత్వం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై వివాదాస్పద విమర్శలు, అసభ్య మాటలు చట్టం ప్రకారం నేరమని ఐజీ నయ్యర్ హస్ నయిన్ ఖాన్ తెలిపారు. సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారిపై న్యాయపరమైన విచారణ చేసి శిక్ష విధించవచ్చని బుధవారం ఆయన కార్యదర్శులకు లేఖ రాశారు. విమర్శించే వారిపై ఉక్కుపాదం మోపుతామని బిహార్ ప్రభుత్వం హెచ్చరించింది. సోషల్ మీడియాలోనైనా ఆచుతూచి మాట్లాడాలని పరోక్షంగా హితవు పలికింది. ఈ ఉత్తర్వులను ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. విమర్శలకు బదులివ్వకుండా ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని ఆర్జేడీ, జనతా దళ్ తెలిపాయి. నిర్వేదంతో ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos