ఢిల్లీ : ఫిరోజ్ షా కోట్లా మైదానంలో గురువారం
రాత్రి ఢిల్లీ కేపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కొన్ని రికార్డులు
నమోదయ్యాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 12 పరుగులు చేసినప్పుడు టీ20
ఫార్మాట్లో ఎనిమిది వేల పరుగుల మైలురాయిని
చేరుకున్నాడు. ఈ రికార్డు ఇంతకు మునుపు సురేశ్ రైనా, విరాట్ కోహ్లీల పేరిట ఉంది.
ఇప్పుడు వారి సరసన రోహిత్ చేరాడు. 12 వేల పరుగులతో క్రిస్ గేల్ ముందున్నాడు. ఢిల్లీ
కేపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా ఐపీఎల్లో 150 వికెట్లు తీసిన తొలి భారత
బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. ముంబై ఇండియన్స్ బౌలర్ లసిత్ మలింగ గతంలో ఈ ఘనతను
సాధించాడు. మిశ్రా 150వ వికెట్ రోహిత్ శర్మ కావడం విశేషం.