ఐపీఎల్ వేడుకల రద్దు

ఐపీఎల్  వేడుకల రద్దు

దిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభలను ఈసారి నిర్వహించడం లేదు. దీని కోసం కేటాయించిన డబ్బును పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అందిస్తామని బీసీసీఐ క్రికెట్ పాలకుల కమిటీ వెల్లడించింది. ఏటా ఐపీఎల్ సీజన్ తొలి రోజు బాలీవుడ్ నటీనటులు, గాయకులతో అద్భుతమైన వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ‘ఈ సారి ఐపీఎల్ వేడుక నిర్వహించడం లేదు. దీనికి కేటాయించిన డబ్బును అమరుల కుటుంబాలకు అందజేస్తాం’ అని క్రికెట్ పాలకుల కమిటీ అధినేత వినోద్ రాయ్ తెలిపారు. మార్చి 23న ఐపీఎల్ 12వ ఎడిషన్ ఆరంభం కానుంది. మొదటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. టోర్నీ నిర్వాహకులు రెండు వారాల షెడ్యూలును మాత్రమే విడుదల చేశారు. 17 మ్యాచ్ల వివరాలు అందులో ఉన్నాయి. లోక్సభ ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత మార్పుచేర్పులతో పూర్తి మ్యాచ్ల జాబితా ప్రకటిస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos