ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్ను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.
అయితే ఈ షెడ్యూల్ తొలి రెండు వారాలకు మాత్రమే. మార్చి 23న టోర్నీ ప్రారంభమవుతుంది.
ఏప్రిల్ 5 వరకు జరిగే మొత్తం 17 మ్యాచ్లకు షెడ్యూల్ విడుదలైంది. సార్వత్రిక ఎన్నికల
నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మిగిలిన షెడ్యూల్ను ప్రకటించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
తొలి షెడ్యూల్లో జరుగనున్న 17 మ్యాచ్లకు గాను టోర్నీలోని మొత్తం ఎనిమిది జట్లు నాలుగేసి
మ్యాచులు ఆడనున్నాయి. వీటిల్లో సొంత గడ్డపై రెండు, ప్రత్యర్థి మైదానాల్లో మిగిలిన రెండు
మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. ఆర్సీబీ, డిల్లీ కేపిటల్స్ మాత్రం అయిదేసి మ్యాచులు ఆడనున్నాయి.
ఈ రెండు జట్లు సొంత గడ్డపై మూడేసి సార్లు ప్రత్యర్థులతో తలపడతాయి.