ముంబై : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్తో శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆయనను ఆహ్వానించారు. ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం కీలకం కావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కేసీఆర్ గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు గవర్నర్ విద్యాసాగర్ రావును కేసీఆర్ కలుసుకున్నారు.