హోసూరు : మాజీ ఎమ్మెల్యే, ఐఎన్టీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు కాళన్ అనారోగ్యంతో చెన్నైలోని ఆయన నివాసంలో మృతి చెందారు. కాళన్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1991 నుంచి 1996 వరకు ఎమ్మెల్యేగా, ఐఎన్టీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడుగా, తమిళనాడు రాష్ట్ర కమిటీ అధ్యక్షుడుగా సేవలందించారు. కార్మికుల శ్రేయస్సుకు ఆయన ఎనలేని కృషి చేశారు. ఆయన మృతి పట్ల హోసూరు మాజీ ఎమ్మెల్యే, ఐఎన్టీయూసీ నాయకుడు కె.ఎ. మనోహరన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. హోసూరు ఐఎన్టీయూసీ నాయకులు, కార్మికులు కాళన్ మృతికి సంతాపాన్ని తెలిపారు.