హైదరాబాద్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ ప్రజలను అవమానించారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఇవ్వడం తప్పు అన్నట్లు భాజపా నాయకులు ఉభయ సభల్లో మాట్లాడుతుంటే తెరాస ఎంపీలు మౌనంగా ఉండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిని బట్టి తెలంగాణను ఇవ్వడం భాజపాకు ఇష్టం లేనట్లుందని వ్యాఖ్యానించారు. ఏ బిల్లు ఆమోదానికైనా ఉభయ సభల తలుపులను మూసివేస్తారని తెలిపారు. కాగా ఈ నెల 20న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.