అమరావతి: మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు మృతి గురించి సమగ్ర విచారణ జరిపించాలని వైకాపా శాసనసభ్యుడు అంబరి రాంబాబు తెలం గాణ ప్రభుత్వాన్ని సోమవారం ఇక్కడ డిమాండు చేసారు. కోడెల మృతి చాలా బాధాకరమని, కుటుంబసభ్యులకు తన ప్రగాఢసానుభూతి తెలి పారు.‘మృతిపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల వార్తలు వస్తున్నాయి. ‘ఆత్మహత్య’ అని కొందరు, ‘గుండెపోటు’ అని మరి కొందరు అంటున్నారు. వివాదాస్పద మరణంలా కనిపిస్తోంద’న్నారు.