పుట్టినింట్లో ఉంటూ…

పుట్టినింట్లో ఉంటూ…

హొసూరు : ఇక్కడి కృష్ణగిరి జాతీయ రహదారిపై సూళగిరి సమీపంలోని చిన్నారు వద్ద శుక్రవారం బస్సు ఢీ కొన్న సంఘటనలో గాయపడిన సుధ పుట్టినింట్లో ఆశ్రయం పొందుతోంది. యూ టర్న్‌ వద్ద మలుపు తిరుగుతున్న లారీని తప్పించబోయిన ప్రైవేట్‌ బస్సు సర్వీసు రోడ్డులో బస్సు కోసం వేచి ఉన్న సుధను ఢీ కొన్న సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. భర్త జయ కుమార్‌ వదలి వేయడంతో ముగ్గురు పిల్లల తల్లి అయిన సుధ పుట్టింటిలో ఉంటోంది. ఆమె పరిస్థితిని చూసి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos